పంజాబ్‌లో ఆర్ఆర్ఆర్…ఫోటోలు వైరల్!

87
- Advertisement -

ఆర్ఆర్ఆర్ మూవీ మార్చ్ 25న విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సందడే కన్పిస్తోంది. నిన్న బరోడా, ఢిల్లీలలో ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న టీం ఇప్పుడు పంజాబ్ కు చేరుకుంది.

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ని ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి సందర్శించారు. ముగ్గురూ కస్టమైజ్డ్ ఆర్ఆర్ఆర్ ప్రింట్‌తో ఉన్న తెల్లటి కుర్తా పైజామా ధరించి ఆలయానికి వెళ్లారు.

ఇవాళ ఇక్కడి మీడియాతో టిక్ టాక్ ను నిర్వహించనున్నారు. జైపూర్ లో సాయంత్రం 3 గంటలకు, 5 : 10 గంటలకు మరో రెండు ఈవెంట్లు ఉన్నాయి.ఈ చిత్రంలో రామ్ చరణ్, అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్, ఒవిలియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -