వారిద్దరితో టచ్‌లో లేను: దానయ్య

36
- Advertisement -

ఆస్కార్‌లో తెలుగోడి సత్తా చాటింది ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ దక్కగా అంతా ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత చరణ్, తారక్, రాజమౌళి, RRR టీం ఎవ్వరితో కాంటాక్ట్ లో లేను. కానీ నేను నిర్మించిన సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు సంతోషిస్తున్నాను అని తెలిపారు. అయితే వీరిమధ్య కాంటాక్ట్ ఎందుకు లేదో మాత్రం చెప్పలేదు.

అయితే ఇంత పెద్ద పురస్కారాన్ని గెలుచుకున్న తర్వాత కూడా చిత్ర నిర్మాత దానయ్య ఇలా RRR టీమ్‌కు ఎందుకు దూరంగా ఉన్నారని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు ప్రమోషన్స్‌కి దాదాపు రూ. 80 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. అయితే ఇంత ఖర్చు దానయ్యకు ఇష్టం లేదని అందుకే ప్రమోషన్స్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని ఇన్‌సైడ్ టాక్. ఏదిఏమైనా దానయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -