గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీం..

211
rrr
- Advertisement -

టాలీవుడ్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతుండగా లాక్ డౌన్‌ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తికాగా తాజాగా రామ్ చరణ్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ని స్వీకరిస్తూ మొక్కలు నాటింది ఆర్ఆర్ఆర్ మూవీ టీం. రాజమౌళితో పాటు 25 మంది ఆర్ఆర్ఆర్ టీం సభ్యులు లింగంపల్లిలోని రాజమౌళి ఆఫీస్‌లో మొక్కలు నాటారు. తర్వాత ఆచార్య,రాధే శ్యామ్,పుష్ప చిత్రయూనిట్‌కి గ్రీన్ ఛాలెంజ్ ఇవ్వగా రాజమౌళి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ,వివి వినాయక్,పూరి జగన్నాథ్‌లకు గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు.

ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించననున్నారు. హలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్, బాలీవుడ్ భామ అలియా భట్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సముద్రఖని, రే స్టీవెన్‌సన్, ఎలిసన్ డూడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

- Advertisement -