విశాఖ టెస్ట్.. రోహిత్ శర్మ మరో సెంచరీ

356
rohithsahramatest
- Advertisement -

టిమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తన ఆటతో ప్రత్యర్ధులకు చెమటలు పట్టిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా సరే ఆన అదే దూకుడును ప్రదర్శిస్తున్నాడు. విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులతో విజృంభించిన రోహిత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో శతకంతో ఆకట్టుకున్నాడు. 133 బంతుల్లో 100 పరుగులను పూర్తి చేశాడు.

ఓపెనర్ గా ఆడిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ చేసి రికార్డు సాధించాడు రోహిత్ . రోహిత్‌ కెరీర్‌లో వైజాగ్‌ టెస్టు ప్రత్యేకంగా నిలువనుంది. టీ విరామం అనంతరం స్వల్ప వ్యవధిలోనే పుజారా(81: 148 బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 54 ఓవర్లు ముగిసేసిరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

- Advertisement -