రోగ్‌పై పూరి బ్యూటీ ఫిర్యాదు..

201
- Advertisement -

పూరి జగన్నాథ్‌ సినిమాల్లో కేవలం హీరోలకే కాదు..హీరోయిన్లకి కూడా ఫుల్‌ క్రేజ్‌ ఉంటుంది. పూరి తన సినిమాల్లో ఉండే ప్రతీ సీన్‌ ఎంత కొత్తగా ఉండాలనుకుంటాడో..హీరోయిన్‌ విషయంలో కూడా అలాగే ఆలోచిస్తాడు పూరి. కొత్త హీరోయిన్‌ వేటలో పడ్డ పూరికి కత్తిలాంటి ఫిగర్‌ కంటపడింది. ఆ హీరోయినే..ఏంజెలా. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి పూరి బ్యూటీ చిక్కుల్లో పడింది.

సామాన్య జనాలతో పాటు సెలెబ్రెటీస్‌ కూడా సోషల్‌ మీడియాలో వేధింపులు తప్పవు అన్నట్టే.. ఇప్పుడు ఏంజెలా కూడా ఆ వేధింపుకు గురైంది. తనని మానసికంగా వేధిస్తున్నాడంటూ ఏంజెలా ఓ రోగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూరి తెరకెక్కించిన జ్యోతిలక్ష్మీ మూవీతో పాపులర్ అయ్యింది ఏంజెలా. ప్రస్తుతం రోగ్ ఫిల్మ్‌లో నటించింది ఈ భామ.

ఫేక్ ప్రొఫైల్‌తోవున్న రాహుల్ ఖన్నా అనే వ్యక్తి.. కొద్దిరోజులుగా తనని మానసికంగా వేధిస్తున్నాడంటూ ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతగాడి నుంచి వేధింపులను ఆపాలని అందులో ప్రస్తావించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

- Advertisement -