సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌…కెప్టెన్‌గా పంత్!

76
pant
- Advertisement -

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు వికెట్ కీపర్‌ రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించినట్లు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ వేదికగా ఇవాళ తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది.

విశ్రాంతి కోసం రోహిత్ శర్మ ఇప్పటికే సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోకపోవడంతో తాజాగా కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఈ నెల 12న కటక్‌లో రెండో టీ20, 14న విశాఖపట్నంలో మూడో మ్యాచ్, 17న రాజ్‌కోట్‌లో నాలుగో మ్యాచ్, 19న బెంగళూరులో ఐదో టీ20 మ్యాచ్ జరుగుతాయి.

టీ20 సిరీస్‌కు భారత జట్టు:

రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్ – కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్, వెంకటేశ్‌ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్షర్‌ పటేల్, రవి బిష్నోయ్‌, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్‌ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

- Advertisement -