సాహో కోసం శ్రద్ధా ఎంత తీసుకుందో తెలుసా..?

469
shraddha kapoor
- Advertisement -

సాహోతో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకురానుండగా యువీ క్రియేషన్స్ దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. భారత సినీ చరిత్రలో బిగ్గెస్ట్ యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్‌తో యాక్షన్‌ సీన్స్‌లో సమజోడిగా నటించింది శ్రద్ధా.

అయితే ఇప్పటివరకు ఈ మూవీ కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ పై రకరకాల ప్రచారం జరుగగా తాజాగా శ్రద్ధా కపూర్ రెమ్యునరేషన్‌పై పుకార్లు షికార్ చేస్తున్నాయి. దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డ శ్రద్ధా దాదాపు రూ. 7 కోట్ల డిమాండ్ చేసి అంతే మొత్తంలో తీసుకుందని టాక్ నడిచింది.

కానీ ప్రస్తుతం సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సాహో కోసం రూ. 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందట శ్రద్ధా. ‘సాహో’ భారీ విజయం సాధిస్తే తన రేంజి మరింత పెరగడం ఖాయమనే ధీమాలో ఉందట శ్రద్ధా. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకురానున్న సాహో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో వేచిచూడాలి.

- Advertisement -