మే 1న `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`

420
SBSB (1).jpeg
- Advertisement -

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు హైద‌రాబాద్‌లో స్టార్ట్ అయ్యింది.

న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేసి మే 1, 2020లో సినిమాను విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. మ్యూజిక్ సెన్సేస‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

కాగా సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ప్రతిరోజూ పండగే సినిమాలో నటిస్తున్నారు. ఈమూవీ షూటింగ్ ను ఇటివలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో చిత్ర యూనట్ బిజీగా ఉంది. డిసెంబర్ 20న ఈసినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈసినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.

- Advertisement -