మల్టీస్టారర్ మూవీకి సిద్ధం: బాలయ్య

169
nbk
- Advertisement -

విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శనం చేసుకుంది అఖండ చిత్ర యూనిట్. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య…అఖండ సినిమా అఖండమైన విజయం సాధించిందని… సినిమా విజయంతో అమ్మవారిని దర్శించుకున్నాం అన్నారు. సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకి రావడం సంతోషం…నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిని కాపాడారు..ఇప్పుడు సనాతన దర్మాన్ని కాపాడిన సినిమా అఖండ అన్నారు.

సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞతలు తెలిపారు. ఏదైన పని తలపెడితే విజయం తద్యం అమ్మవారి అశీస్సులతో సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది…మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపించారన్నారు. టిక్కెట్ల విధానంపై గతంలో చర్చించుకున్నాం..ఏదైతే అదని సినిమా విడుదల చేసాం…సినిమా మంచిగా వచ్చిందని డేర్ స్పెప్ వేశాం కొంతమంది ఆగినా మేమెక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రభుత్వం అప్పీల్ కు వెల్తామంటున్నారు చూద్దాం అన్నారు.

మంచి కధ వస్తే మల్టీస్టారర్ సినిమా తీస్తాం…చిత్రం విజయం పరిశ్రమకు ఊపిరినిచ్చిందన్నారు. అఖండ సినిమా విజయం తో మిగతా వారికి ధైర్యం వచ్చింది.. అందరూ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై నా వంతుగా నేను గతంలో మాట్లాడానని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.. ప్రభుత్వం అప్పీల్ కు వెల్తానంటుంది.. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి దాని బట్టి స్పందిస్తానన్నారు.

- Advertisement -