దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం పూర్తి

397
Disha-case
- Advertisement -

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపధ్యంలో నేడు నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్ మార్టం నిర్వహించారు.

ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్య నిపుణులు గాంధీ ఆసుపత్రిలో రీపోస్ట్ మార్టం ప్రక్రియను కాసేపటి క్రితమే పూర్తి చేశారు. రీ పోస్ట్ మార్టం ను వీడియోలో చిత్రికరించారు. నివేదిక వివరాలను సీల్డ్ కవర్ లో ఉంచి ఈ సాయంత్రం కోర్టుకు సమర్పించనున్నారు. కాగా మరికాసేపట్లో మృతదేహలను కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. మృతదేహాలను స్వగ్రామానికి తరలించేందుకు రెండు అంబులెన్స్ లను ఏర్పాటు చేశారు అధికారులు.

- Advertisement -