లాస్ట్ బాల్ సిక్సర్…ఆర్సీబీ గెలుపు

149
rcb
- Advertisement -

ఐపీఎల్ 2021లో ఆర్సబీ ఉత్కంఠపోరులో విజయబావుటా ఎగురవేసింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ లాస్ట్ బాల్ సిక్సర్‌తో విజయం సాధించింది. దీంతో 20 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి 6 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు పీకల్లోతూ కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన శ్రీకర్‌ భరత్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. డివిలియర్స్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన భరత్‌.. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఓవరాల్‌గా 52 బంతుల్లో 78 పరుగులు చేసిన భరత్‌…లాస్ట్ బాల్ సిక్స్‌ కొట్టి జట్టును గెలిపించాడు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 164 పరుగులు చేసింది. పృథ్వీ షా 48, ధావన్ 43 పరుగులు చేశారు.

- Advertisement -