- Advertisement -
దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్తో టాలీవుడ్ మెగా పవర్స్టార్ రామ్ చరణ్, తమిళ డైరెక్టర్ శంకర్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్లో ఇది 15వ సినిమా కాగా…పాన్ ఇండియా మూవీగా సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలోని రాజమండ్రి పరిసరాల్లో సినిమా షూటింగ్ జరుగుతుండగా తొలుత 2023 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం సినిమాను వచ్చే ఏడాది దసరాకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే శంకర్…చరణ్ సినిమాతో పాటు కమల్ హాసన్తో భారతీయుడు 2 మూవీ చేస్తున్నారు. తొలుత ఇండియన్ 2 పూర్తి చేసి తర్వాత చరణ్ సినిమాను కంప్లీట్ చేయనున్నారట. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.
- Advertisement -