అవన్నీ రూమర్లే…

193
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చన దగ్గరి నుంచి టీ టౌన్‌లో రోజుకోవార్త చక్కర్లు కొడుతోంది.

ఈ మ‌ల్టీ స్టార‌ర్ మూవీలో ర‌వితేజ‌ని విల‌న్‌గా తీసుకోవాలని రాజ‌మౌళి భావిస్తున్నాడ‌ని కొద్ది రోజుల నుండి రూమ‌ర్స్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై రవితేజ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి న‌న్ను ఎవరూ సంప్రదించ‌ లేదు పైగా నేను విల‌న్‌గా న‌టిస్తున్నాన‌డంలో ఎలాంటి నిజం లేదు అని ర‌వితేజ స్ప‌ష్టం చేశారు.

అంతేగాదు కెరీర్‌ ప్రారంభంలో ప్రయోగాలకు పెద్దపీట వేశానని కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. ఇక‌ ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ప‌నుల‌లో బిజీగా ఉన్న రాజ‌మౌళి ఈ మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్‌ని అక్టోబ‌ర్‌లో సెట్స్ పైకి తీసుకెళ‌తాడ‌ని అంటున్నారు. 2019 వేసవి నాటికి సినిమాని రిలీజ్ చేయాల‌ని టీం ప్లాన్‌గా తెలుస్తుంది. ఎన్టీఆర్- రామ్ చరణ్‌లు ఈ సినిమాలో అన్నదమ్ములుగా నటిస్తారని టాక్. ప్రస్తుతం రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమాతో బిజీగా ఉంటే, ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

- Advertisement -