ఆ పని చేయనంటున్న రవితేజ..!

269
Ravi Teja about Touch Chesi Chudu
- Advertisement -

రాజా ది గ్రేట్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన హీరో రవితేజ. ఫిబ్రవరి 2న టచ్ చేసి చూడుతో ప్రేక్షకుల ముందుకువస్తున్నా ఈ మాస్ మహరాజా ఇకపై ప్రయోగాలు చేయనని చెబుతున్నాడు. గతంలో ‘శంభో శివ శంభో’ .. ‘నేనింతే’ .. ‘ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ వంటి సినిమాల్లో ఛాలెంజింగ్ రోల్స్ చేశాను. కానీ అవేమీ పెద్దగా ఆడలేదు. జనాలు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో .. వాళ్లకి నేను అలాగే కనిపించాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.

ఇక ఈ సినిమా తర్వాత ఫ్లాప్ దర్శకుడు శ్రీనువైట్లతో సినిమాకు కమిట్ అయ్యాడు రవితేజ. రవితేజ ‘నీకోసం’ సినిమా ద్వారానే శ్రీనువైట్ల దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తరవాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వెంకీ’, ‘దుబాయి శీను’ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేయనుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఫిల్మ్ ఛాంబర్‌లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. దీంతో పాటు రవితేజ ‘టచ్ చేసి చూడు’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా త్వరలో శ్రీనువైట్లతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించడంతో వీరి కాంబోలో వచ్చే మూవీకి ‘అమర్ అక్బర్ ఆంథోని’ టైటిల్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.

- Advertisement -