‘ఈగల్’ సెల‌బ్రేషన్స్ లో ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’

17
- Advertisement -

రవితేజ హీరోగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన మూవీ ‘ఈగల్’. ఈ మూవీ ఈనెల 9న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా స‌క్సెస్ వేడుక‌ల‌ను ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ బృందం సెల‌బ్రేట్ చేసుకుంది. దర్శకుడు హరీష్ శంకర్‌తో రవితేజ మిస్టర్ బచ్చన్ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ షూటింగ్ సెట్‌లోనే మేక‌ర్స్ ర‌వితేజ‌తో ‘ఈగల్‌’ స‌క్సెస్ ను సెల‌బ్రేట్ చేసుకుంది.

ఇక ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్‌ డే ప్రపంచవ్యాప్తంగా రూ.11.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో రోజు సైతం ఈ ఈగల్ సినిమా అదే జోరు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.20.90 గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మూడో రోజు కూడా రూ. 7 కోట్లను రాబట్టింది. ఐతే, ఈ సినిమాకి పలు వెబ్ సైట్లు బాగా నెగిటివ్ రివ్యూస్ ఇచ్ఛాయి. అందుకే, ‘ఈగల్’ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు.

ఇంతకీ, హరీష్ శంకర్ ఏం మాట్లాడాడు అంటే.. ‘ఓ డైరెక్టర్ నాలుగేళ్లుగా సినిమా తీయట్లేదు.. రాత్రంతా తాగుతూ ఉన్నాడు..’ అంటూ రాస్తున్నారు. దమ్ముంటే తన పేరు రాయాలన్నారు. సినిమా పరిశ్రమలో మీరు కూడా ఒక భాగమే ఇలాంటివి చేసి పరిశ్రమ విలువను తగ్గించొద్దని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. అలాగే ఈగల్ సినిమాకి తక్కువ రేటింగ్ ఇచ్చారు అంటూ సీరియస్ అయ్యారు.

Also Read:వైసీపీ క్లారిటీ.. రాజధాని ‘అమరావతే’!

- Advertisement -