600 బాలికలపై అత్యాచారం – అమానుషం

431
rapist
- Advertisement -

దేశ రాజధాని డిల్లీలో ఓ కామాంధుడి వికృత చేష్టలు యావత్ దేశం తలదించుకునేలా చేసింది. అభం శుభం తెలియని 600 మంది బాలికలపై ఆఘాయిత్యం చేసిన..ఓ కామ పిశాచిని పోలీసులు అరెస్ట్ చేయడంతో అతడి బాగోతం బయటపడింది. కొంతకాలం నుంచి తూర్పు ఢిల్లీలో ఓ టైలరింగ్ దుకాణంలో పనిచేస్తున్న 38 ఏళ్ల సునీల్ రస్తోగీ అనే వ్యక్తిని ఇద్దరు బాలికలపై అఘాయిత్యం చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణలో మరో దారుణమైన సంచలన విషయం బయటపడింది. గత 12 ఏళ్లలో తాను దాదాపు 600 మంది పిల్లలపై అఘాయిత్యం చేసినట్లు రస్తోగీ తెలిపాడు. దీంతో పోలీసులు నిర్గాంత పోయారు. ఇదే నేరానికి గాను ఇంతకుముందు 2006 సంవత్సరంలో ఆరు నెలలు జైల్లో కూడా ఉన్నాడు.
rapist
ప్రధానంగా ఢిల్లీ, పశ్చిమ యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో తరచు నివాస స్థానాలను మారుస్తూ..ఇంటి నుంచి స్కూళ్లకు నడుచుకుంటూ వెళ్లే బాలికలను ఇతడు లక్ష్యంగా చేసుకునేవాడని పోలీసులు చెప్పారు. స్కూళ్లకు వెళ్లె 7 నుంచి 10ఏళ్ల వయస్సు ఉన్న బాలికలను మీ తల్లిదండ్రులు బట్టలు ఇవ్వమన్నారని వారిని నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి వారిపై లైంగికదాడికి పాల్పడేవాడు. ప్రస్తుతం ఆధారాలు దొరికిన ఆరు కేసుల్లో మాత్రం రస్తోగీని బుక్ చేశారు. వాటిలో మూడు ఢిల్లీ, రెండు రుద్రాపూర్ మరొకటి బిలాస్‌పూర్ జిల్లాలోనివి. 2004 సంవత్సరంలో మయూర్ విహార్ ప్రాంతంలో ఉండేటప్పుడు పొరుగింట్లో ఉండే ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేయబోగా.. చుట్టుపక్కల వాళ్లు చితక్కొట్టి అక్కడినుంచి తరిమేశారు.

2016 డిసెంబర్ 13వ తేదీన పదేళ్ల బాలిక స్కూలు నుంచి తిరిగొస్తుండగా అత్యాచారానికి గురి కావడంతో ఇతడి పాపం పండింది. ఆమె ప్రవర్తన తేడాగా ఉండటంతో ఆమెను అడగ్గా, చివరకు విషయం తెలిసింది. బాలిక చెప్పిన వివరాలను, పోలికలను బట్టి నిందితుడి కోసం పోలీసులు గాలించడం మొదలుపెట్టారు. ఇంతలో జనవరి 12వ తేదీన న్యూ అశోక్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మరో ఇద్దరు బాలికలు అపహరణకు గురయ్యారని ఫిర్యాదు నమోదైంది. కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి రస్తోగీ వాళ్లను తీసుకెళ్లాడు. నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు వెళ్లి అక్కడ అత్యాచారం చేయబోగా పిల్లలు అరవడంతో అక్కడినుంచి పారిపోయాడు. అతడిని కోండ్లి గ్రామంలో పోలీసులు అరెస్టు చేశారు. తాను 2004 నుంచి ఈ తరహా నేరాలు చేస్తున్నట్లు విచారణలో రస్తోగీ వెల్లడించడంతో అంతా నిర్ఘాంతపోయారు. ఇతనికి ఐదుగురు సంతానం.

- Advertisement -