సాయి పల్లవితో రానా ‘విరాటపర్వం’‌..!

253
rana
- Advertisement -

విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు రానా . బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలలో నటిస్తూ అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలు చేస్తున్న రానా మరో విభిన్నమైన చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నీదీ నాది ఒకే కథ చిత్రాన్ని తెరకెక్కించిన వేణు ఉడుగుల దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రానా సరసన ఫిదా, ఎంసీఏ, కణం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా పడి పడి లేచే మనసు చిత్రంలో నటిస్తోంది సాయి పల్లవి. ఈ సినిమా తర్వాత రానాతో కలిసి రొమాన్స్ చేయనుంది ఈ కేరళ భామ.

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి విరాటపర్వం 1992 అనే టైటిల్ ఖరారు చేశారు. తొలుత ఈ చిత్రానికి నాని, శర్వానంద్, నితిన్ లాంటి యంగ్ హీరోల పేర్లు వినిపించాయి. కానీ చివరకు రానా ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

త్వరలోనే పట్టాలెక్కబోతున్న ఈసినిమాలో సాయి పల్లవికి జోడిగా రానా అంటే… మళ్ళీ మనకి ఫిదా గుర్తుకు రాకపోదు. ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ లాంటి పొడవైన హీరోతో అదరగొట్టిన సాయి పల్లవి ఇప్పుడు రానాతో ఏ విధంగా నటించేస్తుందో చూడాలి.

- Advertisement -