‘రామాయణ’..ట్రైలర్ డేట్‌ఫిక్స్!

5
- Advertisement -

రణ్‌బీర్ కపూర్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా, యష్ రావణాసురుడిగా మరియు సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చారిత్రాత్మక పౌరాణిక చిత్రం యొక్క ట్రైలర్‌ను జూలై 24న ఆవిష్కరించనున్నట్లు ‘రామాయణం’ చిత్రబృందం ఈరోజు అధికారికంగా ప్రకటించింది. నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణం’ ఫ్రాంచైజీలో ఇది మొదటి భాగం.

ఆ అధికారిక ప్రకటనలో “వేలాది సంవత్సరాలుగా రామాయణం తన కాలాతీత ధర్మం, మర్యాద, ధైర్యం మరియు కరుణ వంటి ఆదర్శాల ద్వారా తరతరాలను ప్రేరేపిస్తూనే ఉంది. ఇప్పుడు ఇది ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది – భారతదేశపు గొప్ప నాగరికత ఇతిహాసాలలో ఒకటైన ఈ కావ్యాన్ని, భారతీయ సినిమాలో ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించని భారీ స్థాయిలో ప్రపంచం ముందుకు తీసుకువస్తున్నాము అని పేర్కొన్నారు.

నితేష్ తివారీ ‘రామాయణం’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప మైలురాయిని అందుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్ర నిర్మాతలు జూలై 23న ప్రతిష్టాత్మక ‘శాన్ డియాగో కామిక్-కాన్’ (SDCC) వేదికపై ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించనున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ మోస్ట్ అవేటెడ్ పౌరాణిక చిత్రం యొక్క మొదటి అధికారిక గ్లింప్స్ లభించనుంది.

Also Read:కామిశెట్టి దర్శకత్వంలో రోషన్!

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డిఎన్ఇజి (DNEG) మరియు యష్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ‘రామాయణం’ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రామాయణం మొదటి భాగం దీపావళి 2026 లో ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో విడుదల కావడానికి షెడ్యూల్ చేయబడింది కాగా రెండవ భాగం దీపావళి 2027 లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -