TTD:లక్ష్మణ ప్రాణ ప్రదాత ఆంజనేయుడు

6
- Advertisement -

రామ రావణ యుద్ధంలో లక్ష్మణ ప్రాణ ప్రదాత హనుమంతుడని తెలంగాణ రాష్ట్రం శంషాబాద్ కు చెందిన శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఉద్ఘాటించారు.హనుమత్‌ జయంతి ఉత్సవాలు బుధవారం తిరుమ‌ల‌లో ఘనంగా ముగిశాయి.నాదనీరాజనం, ఆకాశ‌గంగ‌, జ‌పాలి తీర్థంలో నిర్వ‌హించిన ఆధ్యాత్మిక, భ‌క్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ హనుమంతుడు ప్రతి కార్యాన్ని సున్నితంగా గమనించి ధర్మబద్ధంగా నిర్వహించేవాడని తెలిపారు. సుగ్రీవుడికి రాముడికి మైత్రి కల్పించింది హనుమంతుడని చెప్పారు. హనుమంతుడు దేహ బలం, బుద్ధి బలం కంటే సంస్కార బలం చాలా గొప్పదని నిరూపించాడని స్వామీజీ వివరించారు.

ఆకాశ‌గంగలోని శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద శ‌నివారం ఉదయం 10 నుండి 10.30 గంటల వ‌ర‌కు జాతీయ సంస్కృత విశ్వ విద్యాల‌యం అధ్యాప‌కులు ఆచార్య రాఘ‌వాచార్యులు హ‌నుమంతుని జ‌న్మ విశేషాలు తెలిపారు. జాపాలి క్షేత్రంలో ఉద‌యం 8 నుంచి 10 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి భార్గవి బృందం హనుమాన్ చాలీసా ప‌ఠించారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ హరినాధ బృందం నృత్య కార్యక్రమం నిర్వహించారు.

ALso Read:సత్యభామ..ఎమోషనల్ యాక్షన్ మూవీ

- Advertisement -