షాకిస్తున్న… ‘రంగస్థలం’ ప్రీ బిజినెస్!

213
Ram Charan's Rangasthalam pre release
- Advertisement -

రెండు వ‌రుస ప్లాపుల త‌ర్వాత రాంచ‌ర‌ణ్ న‌టించిన ధృవ రీమేక్ సినిమా యావ‌రేజ్ మార్కులు వేయించుకుంది. ధృవ త‌ర్వాత చెర్రీ సుకుమార్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న ‘రంగస్థలం 1985’ పై బోలెడన్ని అంచనాలు నెలకొన్నాయి. అంతేగాక సుకుమార్ దర్శకత్వం చేస్తుండటం, విభిన్నమైన కథాంశంతో సినిమా రూపొందుతుండటంతో ఈ సినిమాపై మెగా అభిమానులే కాక‌, స‌గ‌టు సినీ అభిమానులు సైతం ఆస‌క్తితో ఉన్నారు.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కథానాయికగా సమంతా నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.రాక్‌స్టార్‌ దేవీశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్‌.

ఇంతవరకూ ఈ సినిమా 51 కోట్ల వరకూ బిజినెస్ జరుపుకుందని అంటున్నారు. సినిమా రిలీజ్ కి వెళ్లే లోగా 125 కోట్ల వరకూ బిజినెస్ చేయవచ్చని చెబుతున్నారు. ఈ సినిమా శాటిలైట్ హక్కులకు గాను 16 కోట్లు .. ఇతర డిజిటల్ హక్కులకు గాను 13 కోట్లు వచ్చాయని అంటున్నారు. ‘ధ్రువ’ సినిమాతో 80 కోట్ల వరకూ రాబట్టిన చరణ్, ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని అభిమానులు చెప్పుకుంటున్నారు.

- Advertisement -