వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న మెగ పవర్ స్టార్.. రాంచరణ్ హీరోగా సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా ‘ధృవ’. తమిళంలోఘన విజయం సాధించిన ‘తనీఒరువన్’ రీమేక్గా ఇది తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో పలు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమా టీజర్ను విజయదశమి కానుకగా సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం రామ్చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించడం కోసం కండలు పెంచారు. మీసకట్టు స్టైల్ మార్చారు. కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్. విలన్గా అరవింద్ స్వామి, హీరో కీలక పాత్రలో నవదీప్ నటిస్తున్నారు.
ఇటీవలె స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ధృవ ఫస్ట్ల్ లుక్కు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో దసరా కానుకగా విడుదలవనున్న ధృవ టీజర్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.