పల్లెటూరి ప్రేమకథలో చెర్రీ

235
Ram Charan - Sukumar movie launched
- Advertisement -

ధృవ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. ధృవకు తోడుగా చెర్రి నిర్మించిన చిత్రం ఖైదీ నెంబర్ 150 కూడా రికార్డు వసూళ్లను రాబట్టడంతో అటు నిర్మాతగా ఇటు తన నెక్ట్స్‌ సినిమాలపై దృష్టి సారించాడు. ఇక మెగాస్టార్‌తో 151వ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్న రాంచరణ్ మరోవైపు సుకుమార్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక ఈ సినిమా ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ ముఖ్యఅతిధులుగా హాజరుకాగా మెగాస్టార్ క్లాప కొట్టారు. దర్శకుడు కొరటాల శివ తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించగా రాంచరణ్ స్విచ్చాన్ చేశారు.

ఇప్పటి వరకు ఊర మాస్‌ సినిమాలు, లవ్‌స్టోరీలు చేసిన రామ్‌చరణ్‌ ఇప్పుడు రూట్‌ మార్చాడు. అచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథలో  చెర్రీ బధిరుడిగా కనిపించనున్నట్టు సమాచారం. ప్రారంబోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. రెండు బిందెలను కావడిలో పెట్టుకుని మోస్తున్న పల్లెటూరి యువకుడి స్కెచ్‌ను ఈ పోస్టర్‌లో పొందుపరిచారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.సమంత ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -