ఈడీ విచారణకు హజరు కాలేను- రకుల్‌

125
rakul
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలంగా మారిన డ్రగ్స్‌కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ కొనసాగుతుంది. తాజాగా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను సెప్టెంబర్‌ 6న విచారణకు హజరుకావాలంటూ ఈడీ నోటీసులను జారీచేసింది. కాగా, రకుల్‌ హాజరుపై సందిగ్ధత కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అనివార్య కారణాల వలన తాను ఈడీ సూచించిన తేదిన హజరు కాలేనని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. తనకు మరోరోజు కావాలని ఈడీని కోరారు.

కాగా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు డ్రగ్స్‌ కేసుతో పలు లింకులున్నట్లు ఈడీ విచారణలో గుర్తించింది. అయితే ఈ విచారణలో భాగంగా ఆగస్టు 31న పూరి జగన్నాథ్, సెప్టెంబర్ 2న చార్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ నెల 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతోపాటు శ్రీనివాస్, 13న నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది.

- Advertisement -