రెమ్యునరేషన్‌ తగ్గించుకున్న రకుల్..!

326
rakul preet
- Advertisement -

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈమూవీ విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో బిజీగా ఉంది.

తాజాగా కరోనా కష్టకాలంలో తీవ్రంగా నష్టపోయిన సినిమా నిర్మాతలకు తనవంతు సాయం అందించాలని నిర్ణయించుకుంది రకుల్‌. తాను తర్వాత చేయబోయే సినిమాలకు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది రకుల్.

అయితే తాను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నానో వెల్లడించని రకుల్….తన పారితోషికంలో మాత్రం 50 శాతం కోత విధించాలని నిర్ణయించుకోవడం ప్రస్తుతం టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -