ODF:రక్షణ మంత్రికి లేఖ రాసిన హరీశ్‌రావు

37
- Advertisement -

రక్షణ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయవద్దని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాశారు. దేశ భద్రత కోసం ఆహర్నీశలు కృషి చేస్తున్న మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని 74వేల ఉద్యోగుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ ఉండదని…నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుందని లేఖలో పేర్కొన్నారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సిక్ ఇండస్ట్రీగా ప్రకటించకూడదని అన్నారు. ప్రత్యక్షంగా 2500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5000 మంది ఉపాధి దెబ్బతింటుంది. మొత్తంగా సుమారు 25వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుంది.

Also Read: రోజుల్లో 12గంటల పనివేళలు.. ఎక్కడంటే!

ఈ నేపథ్యంలో ఆయుధ కర్మాగార తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు నా దగ్గరికి వచ్చి ప్రైవేటైజేషన్‌ను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరు డిమాండ్లను నా ద్వారా మీ ముందు  ఉంచుతున్నారు.

  •  మూడు రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
  •  పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి.
  •  మిషనరీని ఆధునికరించాలి. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి.
  •  పరిపాలన, కొనుగోలు విధానాలను సరళీకరించాలి.
  •  ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలి.
  •  ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలి.

వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను అని హ‌రీశ్‌రావు త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Also Read: మిరియాలతో ఆ సమస్యలన్నీ దూరం !

- Advertisement -