విరుష్క నా కండోమ్ వాడండి..

179
Virat-Anushka
- Advertisement -

బాలీవుడ్ పాపులర్ స్టార్లు బిపాసా బసు, సన్నీ లియోన్ తర్వాత… కండోమ్ యాడ్స్ చేస్తున్న భామ రాఖీ సావంత్. ఆమెను అభిమానించే వారు ఈ అడల్ట్ కమర్షియల్స్‌ తమ అభిమాన తారను చూడాలని ఆశపడుతున్నారు. అయితే ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల మధ్య ఈ యాడ్స్ ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం చాలా మందిని డిసప్పాయింట్ చేసింది. కండోమ్ యాడ్స్ ప్రదర్శనను ప్రైమ్ టైమ్‌లో నిషేధించడంపై రాఖీ సావంత్ ఫైర్ అయ్యారు.దేశంలో ప్రజలకు ఎయిడ్స్ తో పాటు సుఖవ్యాధులు ప్రబలేలా చేయడానికే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోంటోందని రాఖీ వ్యాఖ్యానించింది. దేశంలో ఎయిడ్స్ ను వ్యాప్తి చెందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాఖీ విరుచుకుపడింది.

 -rakhi

ఒక దశలో.. ప్రతి వైన్ షాప్ వద్దా.. ఉచితంగా కండోమ్ ప్యాకెట్లు పెట్టిన దేశం మనది. సినీతారలు.. రాహుల్ ద్రావిడ్ వంటి వారి చేత కూడా కండోమ్ లను ప్రమోట్ చేయించిన చరిత్ర ఉంది భారత ప్రభుత్వానికి. మైదానంలోకి దిగేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని.. రాహుల్ ద్రావిడ్ ఒక కండోమ్ యాడ్ లో కనిపించాడు. కేంద్ర సమాచార శాఖే ఆ యాడ్ తీయించింది. బహుశా వాజ్ పేయి హయాంలో. ఇప్పుడు మాత్రం ప్రభుత్వానికి కండోమ్ యాడ్ తప్పనిపిస్తోంది అంటూ కామెంట్‌ చేసింది రాఖి.

 -rakhi

అంతే కాకుండా అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తున్న రాందేవ్ బాబా కూడా కండోమ్స్ ఉత్పత్తుల రంగంలోకి రావాలి. ఫేస్‌పామ్ అనే పేరుతో పతంజలి కండోమ్స్ తీసుకురావాలి అని రాఖీ సావంత్ సూచించారు.విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరు అద్భుతమైన దంపతులు. ఇప్పుడిప్పుడే వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. వారికి నేను కండోమ్స్ గిఫ్టుగా ఇవ్వాలనుకొంటున్నాను అని రాఖీ సావంత్ సంచలన ప్రకటన చేసింది.ఎలాంటి ఇబ్బందిలేకుండా జీవితాన్ని సాగించడానికి కండోమ్స్ ఇవ్వాలనుకొంటున్నాను. నేను గిఫ్టుగా ఇచ్చే కండోమ్స్ వాడిన తర్వాత వాటివల్ల పొందిన అనుభూతి ఎలా ఉందో అనే విషయంపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అని రాఖీ సావంత్ అన్నారు.

- Advertisement -