బోల్డ్ టాక్తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈ సారి తన మాటలతో కాకుండా ఓ షాకింగ్ వీడియోతో హెడ్లైన్స్లో నిలిచింది. రాఖీసావంత్ లీక్డ్ వీడియో అంటూ ఓ ఎంఎంఎస్ వైరల్ అవుతోంది. 38 ఏళ్ల రాఖీసావంత్ దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయంటూ ప్రచారం చేశారు.
సోషల్ మీడియాలో ఆ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో దానిపై రాఖీసావంత్ స్పందించింది. ‘‘ఆ వీడియోను నేను చూశాను. అందులో ఉన్న ఆమె ఎవరో నాకు తెలీదు. చూడ్డానికి అచ్చం నాలాగే ఉంది. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. ఎవరో ఫేస్ మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు’’ అంటూ చెప్పుకొచ్చింది రాఖీ.
అప్పట్లో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసును ఆధారంగా చేసుకుని తీసిన ‘ఏక్ కహానీ జూలీ కి’ సినిమాలో ఇంద్రాణీ ముఖర్జీ పాత్రను రాఖీసావంత్ పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘బిఫోర్ క్రిస్మస్ ఇన్ కశ్మీర్’ సినిమాలో నటిస్తోంది రాఖీ.