- Advertisement -
ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేదుకు సిద్ధమయ్యారు హీరో కార్తీ. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ సినిమా చేస్తుండగా ఈ సినిమా ఫస్ట్ పార్టు సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇక కార్తీ నటించిన మరో చిత్రం సర్దార్ కూడా రిలీజ్కు సిద్ధంగా ఉంది.
ఇక తన తర్వాతి చిత్రాన్ని రాజుమురుగన్ దర్శకత్వంలో చేయనున్నారు. రాజుమురుగన్ చిత్రాల్లో నటులు కనపడరు, పాత్రలే కనపడతాయి. అదే విధంగా కమర్షియల్ అంశాల కంటే కథకే ప్రాధాన్యతనిచ్చే దర్శకుడీయన. కార్తీని ఇంతకు ముందు చిత్రాలకు భిన్నంగా ఇందులో చూపించబోతున్నట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రభు, ఎస్ఆర్.ప్రకాశ్బాబు నిర్మించనున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
- Advertisement -