రోబో 2.0కి ప్యాకప్‌ చెప్పిన శంకర్‌..

217
- Advertisement -

రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజువల్ వండర్ 2.0. ఇదే కాంబినేషన్లో రూపొందిన రోబో సినిమాకు సీక్వల్గా రూపొందుతున్న ఈ సినిమాను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఐ సినిమా ఫెయిల్యూర్తో డీలా పడ్డ శంకర్, 2.0తో మరోసారి తన స్టామినా ప్రూవ్ చూసుకోవాలని భావిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిందని కథానాయిక అమీజాక్సన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. దీంతోపాటు రజనీతో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఆమె, సూపర్‌స్టార్‌ మెడలో పూలమాలలు ధరించి నవ్వుతూ కనిపించారు. నవంబరు 20న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

2010లో శంకర్‌-రజనీ కలయికలో వచ్చిన ‘రోబో’ చిత్రం కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ దానికి సీక్వెల్‌గా తీస్తున్న ‘2.0’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అక్షయ్‌కుమార్‌ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ అవసరం ఉండటంతో వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ పూర్తి చేసి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి 2017 చివర కల్లా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -