చంద్రబాబును పరామర్శించిన రజనీ..

266
chandra babu
- Advertisement -

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును ఫోన్‌లో పరామర్శించారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీ…విచారం వ్యక్తం చేశారు.

అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా బాబుతో ఫోన్‌లో మాట్లాడారు. 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయని.. ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డానని ఆయన ట్వీట్ చేశారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్ అసెంబ్లీలో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేయగా చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో నిరసన వ్యక్తం చేశారు నారా రోహిత్.

- Advertisement -