తెలుగు రాష్ట్రాల్లో 1000ధియేట‌ర్ల‌లో 2.ఓ మూవీ

247
2.0 rajinikanth
- Advertisement -

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ కాంబినేష‌న్ లో తెరెకెక్కిన మూవీ రోబో2.ఓ.. ఈనెల 29వ తేదిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 600కోట్ల‌తో తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్పటికే ప్రి రిలీజ్‌ బిజినెస్‌తోనే దాదాపు రూ. 350 కోట్లు కొల్లగొట్టిన రజనీకాంత్ విడుదల తర్వాత మరిన్ని రికార్డులను చెరిపేయనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 6,800 థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. త‌మిళ‌నాడులో కంటె ఎక్కువ ధియేట‌ర్స్ లో తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేయ‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు. ఒక్క త‌మిళ్ నాడులోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ర‌జ‌నీకాంత్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.

2.0 movie

తమిళనాడులో 600 నుంచి 700 థియేటర్లలోపే ఈసినిమాను ప్ర‌ద‌ర్శింప‌జేయ‌నున్నారు. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 1000ధియేట‌ర్ల‌కు పైగా ఈచిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. నైజామ్ ఏరియాలో 400ధియేట‌ర్లు కేటాయించ‌గా, ఒక్క హైద‌రాబాద్ లోనే 100ధియేర‌ట్ల‌లో 2.ఓ మూవీ విడుద‌ల కానుంది. భారీ అంచనాల మ‌ధ్య విడుద‌ల‌వుతున్న ఈసినిమాకు రెస్పాన్స్ ఎలా ఎండ‌బోతుందొ చూడాలి.

- Advertisement -