మోడ్రన్‌ టెక్నాలజీతో రజిని 2.0 ఫస్ట్‌ లుక్‌

231
- Advertisement -

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘2.0’ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతున్న ‘2.0’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Rajinikanth 2.0 first look launch

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను నవంబర్‌ 20న ముంబాయిలోని యశ్‌రాజ్‌ స్టూడియోలో సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నారు. ఇండియాలోనే ఫస్ట్‌ టైమ్‌ మోడ్రన్‌ టెక్నాలజీతో ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని లైకా ప్రొడక్షన్స్‌ యూ ట్యూబ్‌ ఛానల్‌
(https://www.youtube.com/LycaProductions) లో లైవ్‌ స్ట్రీమ్‌ చేయబోతున్నారు.

Rajinikanth 2.0 first look launch

ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, ఎమీ జాక్సన్‌, సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌, డైరెక్టర్‌ శంకర్‌, నిర్మాత సుభాష్‌కరణ్‌తోపా

- Advertisement -