ఎస్పీ బాలు మృతిపై నాగ్‌,రజినీ భావోద్ద్వేగం..

169
nagarjuna
- Advertisement -

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా సతాపం తెలుపుతున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పందిస్తూ.. బాలు సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నానంటూ రజనీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎన్నో ఏళ్లుగా నా స్వరం మీరే’ అని ట్వీట్ చేశారు. మీ స్వరం, మీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాతో ఉంటాయని అన్నారు. బాలుగారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని తెలిపారు.

అక్కినేని నాగార్జున స్పందిస్తూ.. బాలుగారితో గడిపిన క్షణాలన్నీ గుర్తుకొస్తున్నాయని, కళ్లు చెమ్మగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అన్నమయ్య’ సినిమా తర్వాత ఆయన నుంచి తనకు వచ్చిన ఫోన్ కాల్ ఇప్పటికీ గుర్తుందని చెప్పారు. తన జీవితంలో బాలు ఒక భాగమని అన్నారు. ‘దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో’ అని నాగ్ ట్వీట్ చేశారు.

- Advertisement -