రజనీ ఆడియో ఈరోజే ఎందుకంటే..!

226
- Advertisement -

సూపర్ స్టార్ రజనీతో దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ 2.ఓ. గతేడాదిలో ప్రారంభమైన ఈ చిత్రం సుదీర్ఘ కాలం చిత్రీకరణ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటు ఈరోజు దుబాయ్‌లో భారీ ఎత్తున ఆడియో లాంఛ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. దుబాయ్‌లోని బుర్జ్‌ అల్‌ అరబ్‌ టవర్స్‌లో ఆడియో వేడుకను అట్టహాసంగా నిర్వహించనున్నారు. అయితే ఆడియో వేడుకను ఈరోజే నిర్వహించడానికి ఓ ప్రత్యేకత ఉంది.

Rajini-Akshay Kumar's 2.0 is set for audio launch on October 27

అదేంటంటే ఈరోజు తేదీ ‘27-10-2017’. ఈ తేదీలో ‘2.ఓ’ అక్షరాలు ఉన్నాయి. అంతేకాదు ఈ నెంబర్లలో సంవత్సరం (2017), తేదీ (27), నెల(10) కూడా కలిసి వచ్చాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఆడియో వేడుకను ఈరోజు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గురువారం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అమీ జాక్సన్‌, అక్షయ్‌కుమార్‌, శంకర్‌, రాజు మహాలింగం తదితరులు దుబాయ్‌ చేరుకొన్నారు. పాటల వేడుకకు ముందస్తుగా చిత్రబృందం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి ముచ్చటించింది.

లైకా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘2.ఓ’ ఆడియోకు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 125 మంది సింఫొనీ కళాకారులతో ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 12 వేల మంది కూర్చుని చూసేలా వేదికను ఏర్పాటు చేశారు. దుబాయ్‌లోని మాల్స్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -