ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్..

67
- Advertisement -

ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది రాజస్థాన్. బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్ 2లో విజయభేరి మోగించింది రాజస్థాన్.158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కొల్పోయి 161 పరుగులు చేసింది. బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. కేవలం 60 బంతుల్లో 106 నాటౌట్‌; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) విశ్వరూపం చూపించాడు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కోహ్లీ (7) మరోసారి నిరాశ పరచగా.. గత మ్యాచ్‌ సెంచరీ హీరో రజత్‌ పాటీదార్‌ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్‌ (25), మ్యాక్స్‌వెల్‌ (24) ఫర్వాలేదనిపించారు.

ఐపీఎల్‌ తొలి సీజన్‌ (2008) తర్వాత రాజస్థాన్‌ తుది పోరుకు అర్హత సాధించడం ఇదే మొదటిసారి.

- Advertisement -