గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న రాజార్షి షా ఐఏఎస్‌..

482
Rajarshi Shah IAS
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజార్షి షా ఐఏఎస్‌ ఈరోజు సంగారెడ్డిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని పచ్చదనం పెంచడం కోసం ప్రజలలో చైతన్యం తీసుకువస్తుందని అన్నారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని అందుకోసం తన తోటి ఐఏఎస్ అధికారులు అయిన ప్రతీక్ జైన్ ,రాహుల్ శర్మ అడిషనల్ కలెక్టర్ నల్గొండ,ముజామిల్ ఖాన్ అడిషనల్ కలెక్టర్ సిద్దిపేట లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -