రైల్వే ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. ఎక్స్ప్రెస్ రైళ్ల ఏసీ తరగతుల్లో కి.మీకు రూ.2 పైసలు, నాన్ ఏసీలో కి.మీకు ఒక పైసా చొప్పున ఛార్జీల పెంచారు. ఆర్డినరీ సెకండ్ క్లాస్లో 500 కి.మీ వరకు సాధారణ ఛార్జీలు ఉండనుండగా 501 నుంచి 1500 కి.మీ వరకు టికెట్పై రూ.5..1501 కి.మీ నుంచి 2500 కి.మీ వరకు టికెట్పై రూ.10.. 2501 నుంచి 3000 కి.మీ వరకు రూ.15 చొప్పున పెంచారు.
ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్లపై కి.మీకు అరపైసా చొప్పున పెంచారు. మెయిల్/ఎక్స్ప్రెస్(నాన్ ఏసీ) రైళ్లలో టికెట్లపై నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కి.మీకు ఒక పైసా చొప్పున పెంచారు.
అన్ని రకాల రైళ్లలో ఏసీలో అన్ని తరగతులకు కి.మీకు రూ.2 పైసలు చొప్పున పెంచగా నేటి నుంచి ఈ ఛార్జీలు అమలులోకి రానున్నాయని ప్రకటించింది రైల్వేశాఖ.
Also Read:నల్లమల అడవిలో ఆంక్షలు

