- Advertisement -
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం(రేపు) జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలతో ఎఫెక్ట్ అయిన పూంచ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలకు పూంచ్లోని ఇళ్లు కూలిపోవడమే కాదు లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది.
బలమైనా ఈదురు గాలులకు స్కూల్స్, పలు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించి వివరాలు తెలుసుకోనున్నారు. అలాగే ఆపరేషన్ సిందూర్ కారణంగా పాక్ జరిపిన కాల్పుల్లో కూడా ఆయా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. స్థానిక బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.
Also Read:KTR:రేవంత్ బండారం బయటపడింది
- Advertisement -

