- Advertisement -
కేరళ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుంది. ప్రధాని మోడీ సహా కాంగ్రెస్ అగ్రనేతలంతా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా డెలివరీ బాయ్గా మారారు ఎంపీ రాహుల్ గాంధీ. డెలివరీ బాయ్ స్కూటర్పై దాదాపు 2 కిలోమీటర్లు ప్రయాణించారు. చాలా మంది యువకులు రాహుల్ గాంధీ వెంట పరుగులు తీశారు.
ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నగరంలో మెగా రోడ్షో నిర్వహించారు. న్యూ తిప్పసాంద్ర రోడ్లోని కెంపేగౌడ విగ్రహం నుంచి.. ట్రినిటీ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో జరిగింది. డ్రమ్స్తో సౌండ్ చేస్తూ.. సంగీత వాయిద్యాలను వాయించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆదివారం బెళగావి సౌత్ నియోజకవర్గంలో మెగా రోడ్షో నిర్వహించారు.
కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
- Advertisement -