సుష్మాకు థ్యాంక్స్‌ చెప్పిన రాహుల్‌..

233
- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్ప దూరదృష్టి, ఘన వారసత్వాన్ని గుర్తించినందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సాధించిన ఘనతలను బీజేపీ గుర్తించిందని ఓ వ్యంగ్య బాణాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు.

“సుష్మాజీ… మీకు థ్యాంక్స్. మీ ప్రసంగంలో ఐఐఎం, ఐఐటీల గురించి ప్రస్తావించారు. కనీసం ఈ రూపంలోనైనా కాంగ్రెస్ గొప్పతనాన్ని గుర్తించారు” అని అన్నారు.

 Rahul Gandhi thanks Sushma Swaraj for...

ఐక్యరాజ్యసమితి వేదికగా, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ వైఖరిని ఎండగట్టగా, ఆమె ప్రసంగంపై జాతి యావత్తూ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అయితే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సుష్మా స్వరాజ్ పై విభిన్నంగా స్పందిస్తూ, ఈ ట్వీట్ ను వదిలారు.

ఐఐటీ, ఐఐఎంలతో విద్యావంతులను తయారు చేస్తుంటే, పాక్ ఉగ్రవాదులను ఉత్పత్తి చేస్తోందని సుష్మా స్వరాజ్ మాట్లాడిన సంగతి విదితమే. భారత్ లో ఐఐటీలు, ఐఐఎంలను తామే నెలకొల్పామని గుర్తు చేస్తూ, రాహుల్ ఈ కామెంట్ చేయగా, నెటిజన్లు వెంటనే తమ విమర్శల ధాటిని చూపించారు. విద్యాసంస్థలతో పాటు పెద్ద పెద్ద కుంభకోణాలు సైతం కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఎద్దేవా చేస్తున్నారు. మీరు పార్టీ గురించి మాట్లాడుతున్నారని, సుష్మా దేశం గురించి మాట్లాడారని సెటైర్లు వేశారు.

- Advertisement -