బిలియ‌నీర్ల‌కు మోడీ దాసోహం : రాహుల్

18
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిలియనీర్లకు దాసోహం అయ్యారని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా తాను పోటీచేస్తున్న రాయ్‌బ‌రేలిలో రాహుల్ సోమ‌వారం ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో పాల్గొన్నారు.మోడీ ప్ర‌భుత్వం 22 మంది బిలియ‌నీర్ల‌ను పెంచిపోషిస్తే తాము కోట్లాది పేద మ‌హిళ‌ల‌ను లక్షాధికారులుగా త‌యారుచేస్తామ‌ని స్పష్టం చేశారు.

మోదీ స‌ర్కార్ బ‌డా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు దేశ సంప‌ద‌ను దోచిపెడుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. జూన్ 4న దేశంలో పేద‌లంద‌రి జాబితాను సిద్ధం చేసి ప్ర‌తి కుటుంబంలోని ఓ మ‌హిళ‌ను ఎంపిక చేసి వారి బ్యాంక్ ఖాతాలో ఏటా రూ. ల‌క్ష జ‌మ చేస్తామ‌ని చెప్పారు.

Also Read:వేసవిలో మజ్జిగ..లాభాలు ఇవే!

- Advertisement -