మొక్కలు నాటిన రేడియో జాకీ చైతూ

263
RJChaitu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గోని మొక్కలు నాటారు రెడియో జాకీ చైతు. దేత్తడి హారిక ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి నేడు జర్నలిస్ట్ కాలనీలోని పార్క్ లో మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రెడియోజాకీ చైతూ మాట్లాడుతూ… రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా గొప్పదని అన్నారు . ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనం పెంచడం కోసం కృషి చేయాలని ఇది మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. తాను మరో ముగ్గురికి మొక్కలు నాటాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. సింగర్ హేమచంద్ర,రెడియోజాకీ కాజల్, యువ నటుడు కిరణ్ అబ్బవరంలను మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -