అత్యాచారం జరగలేదు: బీఫార్మాసీ విద్యార్ధి ఘటనపై సీపీ

155
rachakonda
- Advertisement -

ఘట్‌కేసర్ బీ ఫార్మ‌సీ విద్యార్థినిపై అత్యాచారం జ‌ర‌గ‌లేద‌ని వెల్లడించారు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్. విద్యార్ధిని ఎవరూ కిడ్నాప్‌కు ప్ర‌య‌త్నించ‌లేద‌ని …ఇదంతా వారు ఆడిన నాటకమని వెల్లడించారు. ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే కిడ్నాప్ నాట‌కం, అత్యాచారం చేశార‌ని త‌ల్లికి ఫోన్ చేసి చెప్పాన‌ని యువ‌తి పోలీసుల‌కు చెప్పింది. ఆర్నేళ్ల క్రితం కూడా ఆమె ఇలాగే కిడ్నాప్ నాట‌కామాడిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వ‌ల కార‌ణంగానే యువ‌తి ఈ ప్ర‌ణాళిక చేసిన‌ట్లు పోలీసులు వివరించారు.

10వ తేదీ సాయంత్రం 5:30 గంట‌ల నుంచి రాత్రి 7:50 గంట‌ల వ‌ర‌కు 4 కిలోమీట‌ర్ల న‌డిచిన యువ‌తి.. కిడ్నాప్‌, అత్యాచారం చేశార‌ని నాట‌కామాడింది. రాంప‌ల్లి బ‌స్టాండ్ వ‌ద్ద కాలేజీ బ‌స్సు దిగింది. అక్క‌డ్నుంచి ఆటోలో త‌న సీనియ‌ర్‌తో క‌లిసి ఎక్కింది. ఆమె దిగాల్సిన స్టాప్ కంటే ముందే సీనియ‌ర్ దిగి వెళ్లిపోయాడు. హెరిటేజ్ స్టాప్ వ‌ద్ద దిగాల్సిన విద్యార్థి, ఆ త‌ర్వాతి స్టాప్‌లో ఆటో దిగింది. అప్పుడు సాయంత్రం 6:30 గంట‌ల స‌మ‌యం అవుతోంది. యువ‌తి త‌న త‌ల్లికి ఫోన్ చేసి త‌న‌ను ఎవ‌రో కిడ్నాప్ చేశార‌ని చెప్పింది. దీంతో కంగారుప‌డ్డ త‌ల్లి 100కి డ‌య‌ల్ చేయ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

కీస‌ర‌, ఘ‌ట్‌కేస‌ర్‌, మ‌ల్కాజ్‌గిరి పోలీసులు అప్ర‌మ‌త్త‌మై యువ‌తి ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. యువతి ఫోన్ లోకేషన్ ఆధారంగా ఆమెను గుర్తించిన పోలీసులు…ఆమె ఒంటిపై బట్ట‌లు కూడా స‌రిగా లేక‌పోవ‌డంతో పోలీసులు ఆమెపై అత్యాచారం జ‌రిగింద‌ని భావించి మేడిప‌ల్లిలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

యువ‌తి చెప్పిన స‌మాచారంతో అన్నోజిగూడ ఏరియాలోని ఆటో డ్రైవ‌ర్ల‌ను సుమారు 100 మందిని విచారించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ ముగ్గురిలో ఒక‌రు త‌న‌ను బ‌ల‌వంతం చేశార‌ని పోలీసుల‌కు తెలిపింది. దీంతో అత‌న్ని పోలీసులు విచార‌ణ చేయ‌గా, తాను ఆ స‌మ‌యంలో బార్‌కు వెళ్లాన‌ని ఆటో డ్రైవ‌ర్ చెప్పాడు. డ్రైవ‌ర్ స‌మాధానంతో సీసీటీవీ ఫుటేజీలు ప‌రిశీలించ‌గా నిజ‌మేన‌ని తేలింది. యువ‌తి త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ట్లు పోలీసులు గ్ర‌హించారు. యువ‌తిని మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్‌కు అత్యాచారం జరగలేదని…ఇంటి నుండి వెళ్లిపోయేందుకే ఇలా చేసిందని పోలీసులు తెలిపారు.

- Advertisement -