తొలి రౌండ్‌లోనే పీవీ సింధు ఓటమి..

325
- Advertisement -

భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు మరో టోర్నీలో పాల్గొన్నారు. ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్‌లో లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో సైనా నెహ్వాల్, పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్‌ బరిలో దిగారు. కాగా, భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు పెద్ద షాక్ తగిలింది. ఎన్నో అంచనాలతో డెన్మార్క్ ఓపెన్‌లో బరిలో దిగిన సింధు తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

PV Sindhu

మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అమెరికన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి బీవెన్ జంగ్ చేతిలో అనూహ్య ఓటమిని చవిచూసింది.56 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ పోరులో సింధు 17-21, 21-16, 18-21 తేడాతో పరాజయంపాలైంది. జంగ్ చేతిలో సింధు ఓడిపోవడం వరుసగా ఇది మూడోసారి. ఈఏడాది ఫిబ్రవరిలో ఇండియన్ ఓపెన్ ఫైనల్లోనూ సింధుపై అమెరికన్ షట్లర్‌దే పైచేయి కావడం గమనార్హం.

టోర్నమెంట్లో మూడో సీడ్‌గా బరిలో దిగిన సింధు గత కొద్దిరోజులుగా తన మునుపటి ప్రదర్శనను కనబర్చలేకపోతోంది. కచ్చితంగా పతకంతో తిరిగొస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక సైనా అన్‌సీడెడ్ హోదాతో ఈ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. హాంకాంగ్‌కు చెందిన చెంగ్ ఎన్‌జాన్ యీతో సైనా పోటీపడనుంది.

- Advertisement -