మెహబూబా’ కోసం ఇల్లు అమ్మేశా-పూరీ..

335
Puri Jagannadh sold his house for Mehbooba
- Advertisement -

పూరీ జగన్నాత్ దర్శకత్వంలో తనయుడు పూరీ ఆకాశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం మెహబూబా. అయితే పూరీ జగన్నాథ్ సినిమాలు అంటే మాస్ ఆడియన్స్ ఎదురుచూస్తుంటారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో.. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రయోషన్న్‎లో బీజీగా ఉంది. పూరీ టూరింగ్ టాకీస్‎పై పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అయితే గత కొన్ని రోజులుగా ఈమూవీ గురించి ఫిలింనగర్‎లో ఓ వార్త హల్‎చల్ చేస్తుంది. మెహబూబా సినిమా కోసం పూరీ ఓ ఇల్లు అమ్మేశాడని ఓ వార్త షికారు చేస్తోంది.

Puri Jagannadh sold his house for Mehbooba

తాజాగా ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్‎తో ప్రస్థావించగా మెహబూబా సినిమా కోసం ఇల్లు అమ్మేసిన మాట నిజమేనని చెప్పారు. ఇండ్రిస్ట్రీకి కొత్తగా వస్తున్న కుర్రాడిపై డబ్బులు పెట్టేందుకు ఏ నిర్మాతనైనా ఆలోచిస్తారని, ఒక వేళ ముందుకు వచ్చినా అనేక కండిషన్లు పెడతారు. అందువల్లనే ఈ సినిమాని తాను నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథపై, ఆకాశ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఇల్లు అమ్మి మరీ సినిమా నిర్మిస్తున్నాను. డబ్బుల గురించి నేను పెద్దగా ఆలోచించను… ఎందుకంటే తిరిగి ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసని చెప్పారు.

Akash-Puri_9535

1971 లో ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగిన ఓ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకాశ్ కి జోడిగా నేహా శెట్టి నటిస్తోంది. ఈ సినిమా మే 11న రిలీజ్ కానుంది. అలాగే ఈ సినిమా ఫుల్ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించకున్నాడు. సందీప్ చౌతా సంగీతం సమకూర్చారు. అయితే తనయుడి సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరక్కిస్తున్న పూరీ మంచి హిట్ అందుకుంటారని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు.

- Advertisement -