దమ్ముంటే వారి పేర్లు బయటపెట్టండి..!

235
Puri Jagannadh on Drug Scandal issue
- Advertisement -

రంగురంగుల చిత్రసీమ వెనుక ఉండే చీకటికోణం మరోసారి బయటపడింది. తెర మీద అభిమానుల నీరాజనాలు అందుకునే హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు.. నిజజీవితాల్లో మాత్రం విలన్లుగా మారిపోయారు. తాము అభిమానించే నటులు మత్తు బానిసలా అని తెలుసుకుంటున్న ఫ్యాన్స్‌ షాక్‌కు గురవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ని షేక్‌చేస్తున్న డ్రగ్స్‌ అంశం ప్రముఖుల పేర్లు బయటికి రావడం సంచలనంగా మారింది.

తాజాగా వెల్ల‌డయిన వివ‌రాల ప్ర‌కారం ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నుంచి నోటీసులు అందుకున్న వారంతా పూరీ జ‌గ‌న్నాథ్ బ్యాచ్ కావ‌డం విశేషం. రవితేజ, ముమైత్ ఖాన్, చార్మి, సుబ్బరాజు, సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడు… వీళ్లంతా దర్శకుడు పూరీకి సన్నిహితులే.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్‌ స్పందించాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తనకు నోటీసులు వస్తే విచారణకు వెళ్తానని పూరి జగన్నాథ్ కొంతమంది మీడియా ప్రతినిధులతో స్పష్టం చేశాడట. అంతేగాదు పదేపదే తన పేరు ప్రస్తావించే బదులు కొంతమంది పేర్లు ఎందుకు తప్పించారో అడగండంటూ సదరు మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్నలేశాడట పూరి.

డ్రగ్స్ కేసులో మంచు మోహన్ బాబు తనయుడు మనోజ్, దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్, అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ కూడా ఉన్నారని వారికి కూడా నోటీసులు వచ్చాయని వారి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని పూరి ప్రశ్నించాడట. అంతేగాదు తాను గతంలో డ్రగ్స్ తీసుకున్నాని కానీ ప్రస్తుతం అందులో నుంచి బయటపడ్డానని తెలిపాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రముఖుల పేర్లు పూరి ప్రస్తావించడాన్న వార్త వైరల్ కావడంతో ఆయన స్పందించారు.

ట్విట్టర్ వేదికగా ట్విట్ చేసిన పూరి తాను ప్రస్తుతం బాలయ్య పైసా వసూల్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాని తాను ఎవరి పేర్లు ప్రస్తావించలేదని తెలిపాడు. అంతేగాదు డ్రగ్స్ వార్తల గురించి ఇంతవరకు ఎక్కడ ప్రస్తావించలేదన్నారు.

https://twitter.com/purijagan/status/886134542146314240

- Advertisement -