హిట్టొచ్చినా, ఫ్లాపులిచ్చినా దర్శకుడు పూరి బిజీనే. బాలయ్యతో పైసా వసూల్తో నిరాశపర్చిన తన నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. తనయుడు ఆకాష్ పూరిని హీరోగా తీర్చిదిద్దే పనుల్లో పడిపోయారు. ఆకాష్ పూరి కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో వైష్ణో అకాడమీ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కథానాయికగా నేహా శెట్టిని కథానాయికగా ఎంచుకొన్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో తన బర్త్ డే సందర్భంగా మెహబూబా పోస్టర్ని రిలీజ్ చేశారు పూరి. ఈ సినిమా స్క్రిప్టు పని పూర్తయిందని … గతంలో తాను తీసిన చిత్రాలకన్నా ఇది భిన్నంగా ఉంటుందని, తన ఆలోచనల పరిధిని దాటి ఉంటుందని అన్నాడు. 1971 నాటి ఇండియా పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో కథ సాగుతుందని చెప్పాడు.
మంగళూరుకు చెందిన నేహా శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నామని అన్నాడు. చిత్రానికి సందీప్ చౌతా మ్యూజిక్ అందించనున్నట్టు తెలిపాడు. అక్టోబర్ లో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని, హిమాచల్ ప్రదేశ్ లో ప్రారంభమయ్యే చిత్రీకరణ ఆపై పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ సాగుతుందని చెప్పాడు. తాను యుద్ధ వాతావరణం మధ్య సాగే లవ్ స్టోరీని తొలిసారిగా తీస్తున్నానని అన్నాడు.
https://twitter.com/purijagan/status/913251999566544896