పూరి – ఛార్మి బంధానికి ఇదే కీలకం

51
- Advertisement -

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో హీరో రామ్ కొత్త సినిమాకి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి హిట్ అందుకున్న రామ్, పూరీ ఆ సినిమాకు సీక్వెల్‌గా డ‌బుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు. ఇవాళ ఉద‌యం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్‌ గా లాంఛ్ అయింది. ఛార్మి క్లాప్ కొట్టిన మొద‌టి షాట్‌కు పూరీ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా, రామ్ “ఇస్మార్ట్ శంక‌ర్ అలియాస్ డ‌బుల్ ఇస్మార్ట్” అని డైలాగ్ చెప్పాడు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జులై 12 నుంచి మొద‌లుకానుంది.

లైగర్ సినిమా డిజాస్టర్ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పై డిస్ట్రిబ్యూట‌ర్స్ అందరూ భారీ ఆశలు పెట్టుకున్నారు. లైగర్ తో తమకు జరిగిన భారీ నష్టాలను డ‌బుల్ ఇస్మార్ట్ తీరుస్తాడని అందరూ భావిస్తున్నారు. అటు పూరి కూడా ఈ సినిమా పై భారీగా హోప్స్ పెట్టుకున్నాడు. ముఖ్యంగా డ‌బుల్ ఇస్మార్ట్ మూవీ ఛార్మికి చాలా కీలకం. పూరి – ఛార్మి బంధం కంటిన్యూ కావాలి అన్నా.. ఎట్టి పరిస్థితుల్లో డ‌బుల్ ఇస్మార్ట్ భారీ విజయం సాధించాలి.

Also Read:మాజీ ప్రియుడిపై కరీనా ఫైర్

దీనికితోడు పూరికి కూడా అవకాశాలు తగ్గాయి. మళ్లీ పూరి తనను తాను ప్రూవ్ చేసుకుంటేనే.. లైగర్ ప్లాప్ నుంచి బయట పడగలడు. అటు, మెగాస్టార్ చిరంజీవి – బాలయ్య లాంటి హీరోలు కూడా సినిమా చేయడానికి ముందుకు వస్తారు. నిజానికి ఈ ఇద్దరు పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ లైగర్ వివాదం కారణంగా ఈ ఇద్దరి హీరోలు పూరికి డేట్లు ఇవ్వలేదు. కానీ రామ్ ఇచ్చాడు. మరి డ‌బుల్ ఇస్మార్ట్ ఏ స్థాయి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

- Advertisement -