ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ గెలుపు

76
rcb
- Advertisement -

ఐపీఎల్ 15వ సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది ఆర్సీబీ. డుప్లెసిస్ నాయకత్వంలో ఆర్సీబీ బరిలోకి దిగగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆర్సీబీ విధించిన 206 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కొల్పోయి 208 పరుగులు చేసి పంజాబ్ గెలుపొందింది. కెప్టెన్ మయాంక్ 32,ధావన్ 43,రాజపక్స 43,షారుఖ్ ఖాన్ 24,స్మిత్ 25 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కొల్పోయి 205 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ 88 పరుగులు చేయగాకోహ్లీ 41,కార్తీక్ 32 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించారు.

ఇక అంతకముందు జరిగిన తొలిమ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. ముంబై ఇండియ‌న్స్‌పై ఢిల్లీ గెలిచింది. ముంబై విధించిన 178 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కొల్పోయి 179 పరుగులు చేసి విజయబావుటా ఎగురవేసింది.

- Advertisement -