తెలంగాణకు పంజాబ్ సీఎం..

48
- Advertisement -

ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ఈ మేరకు నిన్ననే హైదరాబాద్ చేరుకున్న మాన్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి సిద్దిపేటలో పర్యటించనున్నారు మాన్‌.

మార్కుక్ లోని కొండపోచమ్మ సాగర్ ను సందర్శించనున్నారు. అనంతరం ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల మధ్య కూడవెళ్లి వాగుపై నిర్మించిన చెక్ డాం పరిశీలించనున్నారు. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. ఇద్దరు సీఎంల పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -